వరంగల్లో షర్మిల, చెత్తను దాటలేక హైదరాబాదులో టిడిపి (పిక్చర్స్)
హైదరాబాద్/వరంగల్: వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తట్టుకోలేక చనిపోయిన కుటుంబాల బాధ్యులెవరు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని వైసిపి నాయకురాలు షర్మిల బుధవారం అన్నారు. షర్మిల పలు కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా తాము అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
మరోవైపు, హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ నేతలు బుధవారం నగరంలో రోజంతా పర్యటించారు. నగరంలోని సమస్యలను ఆకళింపు చేసుకునేందుకు వారు పర్యటించారు.
వరంగల్లో షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల బుధవారం ఘనపురం నియోజకవర్గంలోని మల్కపురంలోని ఓ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ...
వరంగల్లో షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల బుధవారం ఘనపురం నియోజకవర్గంలోని పీసరలో వెంకటయ్య కుటుంబాన్ని ఓదారుస్తూ..
వరంగల్లో షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గంలోని సింగారంలో రాజయ్య కుటుంబ సభ్యులను ఓదారుస్తూ...
వరంగల్లో షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గంలోని మామునూరులో భాస్కర్ కుటుంబాన్ని ఓదారుస్తూ..
హైదరాబాదులో టిడిపి
హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ నేతలు బుధవారం నగరంలో రోజంతా పర్యటించారు. నగరంలోని సమస్యలను ఆకళింపు చేసుకునేందుకు వారు పర్యటించారు.
హైదరాబాదులో టిడిపి
హైదరాబాదులోని రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ పథకాల కింది రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోవడం, చేపట్టిన నిర్మాణాలు నాసిరకంగా ఉండటం టిడిపి యాత్రలో బయటపడింది.
హైదరాబాదులో టిడిపి
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధుల మధ్య గొడవ వల్లే లబ్ధిదారుల ఇళ్ల కేటాయింపులో జాప్యం జరిగిందని కొందరు విమర్శించగా, రూ.లక్షలు చేతులు మారాయని నియోజకవర్గ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆరోపించారు.
హైదరాబాదులో టిడిపి
ఎల్లమ్మ బండలో నిర్మించిన ఇళ్ల సముదాయానికి వెళ్లడానికే టిడిపి శాసన సభ్యులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దారిలోనే చెత్త తెచ్చి పోశారు.
హైదరాబాదులో టిడిపి
దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం, ముక్కుమూసుకొనే వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఇళ్ల కిటికీలు దొంగిలించుకు పోయారు. ఇక్కడ అనేకమంది లబ్ధిదారులు ఈ ఇళ్లకు మరమ్మతులు చేయించి నివాసయోగ్యంగా మారిస్తే తమకు తలదాచుకునే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యేల వద్ద మొరపెట్టుకున్నారు.
హైదరాబాదులో టిడిపి
సూరారం కాలనీ సమీపంలోని రాజీవ్ స్వగృహ పథకం కింద 30 ఎకరాల్లో రూ.640 కోట్ల వ్యయంతో ఇళ్లు నిర్మించి విక్రయించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దాదాపు రూ.190 కోట్లు వెచ్చించింది. ఈ భవనాలన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. విలువైన భూములు, నిధులు వృథాగా ఉన్నాయి.
హైదరాబాదులో టిడిపి
అనేక సమస్యలు టిడిపి శాసనసభ్యుల బృందం దృష్టికి వచ్చింది. శాసన సభలో వీటిని ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు.