వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై శోభారాణి నిప్పులు, సవాల్ విసిరి, పారిపోయిన జూపల్లి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: గతంలో బోగస్ పాసుపోర్టులతో మోసగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇప్పుడు బోగస్ వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి శనివారం విమర్శించారు.

ఎన్నికల సమయంలో బోగస్ హామీలు ఇచ్చిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక .. ఇప్పుడు బోగస్ సర్వేలు, బోగస్ ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. కెసిఆర్ పాలన అంతా ఓ బోగస్ అన్నారు. తేలుకు తోకలో విషముంటే, కెసిఆర్‌కు నిలువెల్లా విషమే అన్నారు.

Telugudesam

కాగా, జూపల్లిపై రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ఎవరిని మెప్పించేందుకు మంత్రి జూపల్లి కృష్ణా రావు సవాల్ విసిరానని, ఎన్టీఆర్ భవన్లో తాను నాలుగు గంటలపాటు ఎదురు చూశానని, అయన రాలేదని, జూపల్లి కన్నా పాలమూరుపై తనకే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పారు.

పాలమూరులోని ప్రాజెక్టుల పైన తాను జూపల్లికి బహిరంగ సవాల్ విసిరానని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వస్తానని ఆయన చెప్పారని, తాను సిద్ధమని ప్రకటించి శనివారం నాలుగు గంటల పాటు కూర్చున్నానని చెప్పారు. సవాల్ విసిరి, పారిపోయాడన్నారు.

English summary
Shobha Rani lashes out Telangana CM KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X