శోభయాత్ర: జై శ్రీరామ్ నినాదాలతో భక్తజనం(పిక్చర్స్)
హైదరాబాద్: శ్రీరామ నవమి వేడుకలు నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. భాగ్యనగర్ శ్రీ రామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం శ్రీ సీతారాంబాగ్ నుంచి పెద్ద ఎత్తున నిర్వహించిన శోభాయాత్రకు భక్త జనం పోటెత్తారు. జై శ్రీరామ్ నినాదాలతో పురవీధులు మారుమ్రోగాయి.
శనివారం ఉదయం పది గంటలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ భారీ ఊరేగింపులో అత్యధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. కాషాయపు జెండాలను చేతబూని శ్రీరామ నినాదం చేయటంతో వీధులు కాషాయమయంగా మారాయి. యాత్రలో ముందు ఉంచిన శ్రీ సీతారామ, లక్ష్మణ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆరు కిలోమీటర్ల పొడువున సాగిన సాగిన ఊరేగింపులో దేవతామూర్తులపై పూల వర్షం కురిపించారు. సాయంత్రం 5 గంటలకు పురానాపూల్ చేరుకున్న ఈ శోభాయాత్ర అక్కడి నుంచి గౌలీగూడ, సుల్తాన్బజార్ మీదుగా హనుమాన్ వ్యాయంశాల పబ్లిక్ స్కూల్ వరకు కొనసాగింది. కాగా, యాత్ర ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే బందోబస్తు చర్యలు చేపట్టారు.
శోభయాత్ర
శ్రీరామ నవమి వేడుకలు నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.
శోభయాత్ర
భాగ్యనగర్ శ్రీ రామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం శ్రీ సీతారాంబాగ్ నుంచి పెద్ద ఎత్తున నిర్వహించిన శోభాయాత్రకు భక్త జనం పోటెత్తారు.
శోభయాత్ర
శోభయాత్రలో జై శ్రీరామ్ నినాదాలతో పురవీధులు మారుమ్రోగాయి.
శోభయాత్ర
శనివారం ఉదయం పది గంటలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ భారీ ఊరేగింపులో అత్యధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
శోభయాత్ర
కాషాయపు జెండాలను చేతబూని శ్రీరామ నినాదం చేయటంతో వీధులు కాషాయమయంగా మారాయి.
శోభయాత్ర
యాత్రలో ముందు ఉంచిన శ్రీ సీతారామ, లక్ష్మణ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శోభయాత్ర
ఆరు కిలోమీటర్ల పొడువున సాగిన సాగిన ఊరేగింపులో దేవతామూర్తులపై పూల వర్షం కురిపించారు.