వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
త్వరగా కేసు విచారణ, సీబీఐ కోర్టులో జగన్ కేసు: విజయసాయికి హైకోర్టులో షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి సోమవారం నాడు హైకోర్టులో చుక్కెదురయింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి సోమవారం నాడు హైకోర్టులో చుక్కెదురయింది. ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను త్వరగా విచారించాలన్న హైకోర్టు ఆదేశాల పైన సాయి గతంలో సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను హైకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. ఆయన పిటిషన్ను కొట్టివేసింది. ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను త్వరగా విచారించాలని గతంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల పైన విజయ సాయి సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కేసుల దృష్ట్యా ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులను సమీక్షించాలని కోరారు. ఈ రోజు ఆ పిటిషన్ను హైకోర్టు తిస్కరించింది.
Comments
English summary
Shock to YSRCP leader Vijaya Sai Reddy in High Court.
Story first published: Monday, November 28, 2016, 18:44 [IST]