వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Priyanka Reddy పై అత్యంత పాశవికంగా ఆ నలుగురు... పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ అంశాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి హత్య కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన దారుణం లో పోలీసులు కేసును చేదించారు . పోస్ట్ మార్టంనివేదిక సైతం కీలక విషయాలను వెల్లడించింది. ప్రియాంక రెడ్డి ని అత్యాచారం చేసి, అతి దారుణంగా హత్య చేసి ఆపై 28 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని తీసుకు వెళ్లి అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు పోలీసులు .ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక సైతం ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా నిర్ధారించింది.

ప్రియాంకా రెడ్డి హత్య ఎఫెక్ట్: మహిళలకు రోడ్లపై ఏ ఇబ్బంది ఉన్నా 100 కు కాల్ చెయ్యండి : డీజీపీప్రియాంకా రెడ్డి హత్య ఎఫెక్ట్: మహిళలకు రోడ్లపై ఏ ఇబ్బంది ఉన్నా 100 కు కాల్ చెయ్యండి : డీజీపీ

ప్రియాంకా పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ అంశాలు

ప్రియాంకా పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ అంశాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక షాక్ కు గురిచేసింది. అత్యంత పాశవికంగా ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ చేసి, ఆమెను హతమార్చినట్లు గా పోస్టుమార్టం నివేదికలో తేలింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. దీంట్లో పలు షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం సేవించి నలుగురు ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని, ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని వైద్యులు తేల్చారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
నలుగురు ఆమెపై పాశవిక దాడి చేసినట్టుగా పోస్ట్ మార్టం నివేదిక

నలుగురు ఆమెపై పాశవిక దాడి చేసినట్టుగా పోస్ట్ మార్టం నివేదిక

చంపేసే ముందు కనీసం నలుగురు ఆమెను పాశవికంగా అనుభవించారని, ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. ప్రియాంక రెడ్డి ని రేప్ చేసి, ఆమె గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసిన తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టారని, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వెల్లడించారు.ఈ ఘటనలో ప్రియాంక మృతదేహం 70 శాతానికి పైగా కాలిపోయిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు.

పోలీసుల అదుపులో నిందితులు ...విచారణ వేగం

పోలీసుల అదుపులో నిందితులు ...విచారణ వేగం

ఇక ఈ దారుణానికి సంబంధించి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఓ లారీ డ్రైవర్ క్లీనర్తో పాటు మరో ఇద్దరు కారణమని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారని తెలుస్తోంది . ముగ్గురు నిందితులు 25 ఏళ్ల వయసున్న యువకులని తెలుస్తుంది. పోలీసులు వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

English summary
The post-mortem report on the murder of Priyanka Reddy, who became a sensation in Telugu states, was shocked. The post-mortem reports that the gang raped Priyanka Reddy and killed her. Postmortem report of veterinary doctor Priyanka Reddy Several shocking elements emerged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X