నమ్మించి బైక్ ఎక్కించుకుని అత్తపై అల్లుడి అత్యాచారం
సిద్ధిపేట: కన్న కొడుకులా చూసుకునే అత్తపైనే కన్నేసిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాు. ఈ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపురంలో జరిగింది. అయితే, సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాధితురాలి భర్త ఏడాది క్రితం మరణించాడు. దీంతో కూలి పనులు చేస్తూ కుమారుడికి చేదోడువాదోడుగా ఉంటూ వస్తోంది. గురువారం ఆమె శేర్బండారంలో కూలీ పనిచేసేందుకు వెళ్లింది. పని పూర్తి కాగానే ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందిగా కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది.
అయితే, అదే గ్రామంలో తన కూతురు భర్త ఉన్నాడని తెలిసి అతనికి ఫోన్ చేసింది. తాను అల్లుడితో వస్తానని చెప్పి కుమారుడికి చెప్పి అల్లుడి బైక్పై ఎక్కింది. అయితే, అతను ఆమెను మహ్మదాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాు.
ఆమె ప్రతిఘటించింది. అయితే, ఆమెను చితకబాది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటలకు ఇల్లు చేర్చాడు. అదే రోజు విషయాన్ని కుమారులకు చెప్పి దౌల్తాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి పంపించారు.