ట్రైయంగిల్ లవ్, వేధింపులు: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: రామకృష్ణాపురం చెరువులో దూకి ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల మౌనిక(20), ఆమె సోదరి సౌమ్య(16) అనే ఇద్దరు యువతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.
మౌనిక ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు బుధవారం ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. నేరేడ్మెట్ సీఐ జగదీష్చందర్ కథనం ప్రకారం.. మౌలాలి తిరుమలనగర్కు చెందిన మౌనిక (20), కటకం నాగార్జున (24) అలియాస్ నాని గత కొంతకాలం ప్రేమించుకున్నారు.
కాగా, ఏడాది కాలంగా నాని మిత్రుడు సైనిక్పురి రోహిణికాలనీకి చెందిన గొల్లకోట బాలకామేశ్వరావు (24) అలియాస్ కామేశ్, మౌనిక ప్రేమించుకుంటున్నారు. గతంలో మౌనిక, నాని ప్రేమ విషయం తెలిసి అతనికి దూరంగా ఉండాలని కామేశ్ ఒప్పంద పత్రం రాయించాడు.
తర్వాత మౌనిక మళ్లీ నానితో సన్నిహితంగా ఉన్నట్లు కామేశ్ గుర్తించి ఆమెను తరచూ వేధించేవాడు. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో లభించిన లేఖ, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాని, కామేశ్ను పోలీసులు అరెస్టు చేశారు.
అనారోగ్యంతోనే సౌమ్య బలవన్మరణం
కాగా, అనారోగ్యం వల్లనే మౌనికతోపాటు ఆమె సోదరి సౌమ్య(16) బలవన్మరణానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. అనారోగ్యానికితోడు ఆమెను చేరదీసి చదివిస్తున్న పెద్దమ్మ, పెద్దనాన్మ, అత్తయ్యల వేధింపులు అధికం కావడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన చెప్పారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయన మౌనిక, సౌమ్య తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, అరెస్ట్
రామకృష్ణాపురం చెరువులో దూకి ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, అరెస్ట్
ఇటీవల మౌనిక(20), సౌమ్య(16) అనే ఇద్దరు యువతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, అరెస్ట్
అనారోగ్యం వల్లనే మౌనికతోపాటు ఆమె సోదరి సౌమ్య(16) బలవన్మరణానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. అనారోగ్యానికితోడు ఆమెను చేరదీసి చదివిస్తున్న పెద్దమ్మ, పెద్దనాన్మ, అత్తయ్యల వేధింపులు అధికం కావడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన చెప్పారు.
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, అరెస్ట్
అనారోగ్యానికితోడు ఆమెను చేరదీసి చదివిస్తున్న పెద్దమ్మ, పెద్దనాన్మ, అత్తయ్యల వేధింపులు అధికం కావడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన చెప్పారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయన మౌనిక, సౌమ్య తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు.