ఉదయమే గుడికెళ్లి తరుణ్!: నెలలో 15రోజులు గోవాలో, డ్రగ్స్ నిందితులతో ఫొటోలు!
శనివారం ఉదయం నుంచీ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టాలీవుడ్ హీరో తరుణ్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: శనివారం ఉదయం నుంచీ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టాలీవుడ్ హీరో తరుణ్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా, నెలలో 15రోజులపాటు తరుణ్ గోవాలనే ఉంటారని సిట్ తేల్చినట్లు సమాచారం.
నాకు పబ్బు లేదు, సంయమనం పాటించండి: హీరో తరుణ్
ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను కూడా తరుణ్కు చూపించినట్లు తెలిసింది. అంతేగాక, బీచ్ హౌస్లో డ్రగ్స్ సరఫరా అవుతోందా? అనే విషయంపై ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. తరుణ్ దిగిన పలు ఫొటోల్లో డ్రగ్స్ నిందితులు కూడా ఉండటంతో ఈ విషయంపై లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
కాగా, అంతకు ముందు ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన తరుణ్ మార్గమధ్యంలో గుడికి వెళ్లి దేవుడుకి దండం పెట్టుకున్నాడు. శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి తరుణ్ తన తండ్రితో కలిసి వచ్చిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ సప్లై కేంద్రాలుగా పబ్బులు, బార్లు: నోటీసులందుకున్న పబ్బులివే!
తన ఇంటి నుంచి కారులో జూబ్లీహిల్స్ 12 వద్దకు రాగానే అక్కడ ఓ గుడి కనిపించింది. దీంతో అక్కడే కారుని ఆపి తరుణ్ ఆయన తండ్రి ఆ గుడిలోకి వెళ్లి మొక్కుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు వెళ్లారు.