రవితేజను ఇంకా విచారిస్తున్నాం: సిట్, ప్రశ్నలకు ఆచితూచి సమాధానం
నటుడు రవితేజ విచారణ కొనసాగుతోందని సిట్ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజను సిట్ అధికారులు సమగ్రంగా ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: నటుడు రవితేజ విచారణ కొనసాగుతోందని సిట్ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజను సిట్ అధికారులు సమగ్రంగా ప్రశ్నిస్తున్నారు.
దీంతో విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. రవితేజతో పాటు తాబీర్ అహ్మద్, సయ్యద్ యూనస్లను కూడా విచారిస్తున్నట్టు సిట్ తెలిపింది. రేపు (శనివారం) రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును విచారించనున్నట్టు తెలిపింది.
రవితేజ అలా ఇరుక్కున్నాడా: ఎన్నో ప్రశ్నలు-మరెన్నో అనుమానాలు, ఏది నిజం!?
టాలీవుడ్లో పబ్ కల్చర్, పబ్లలో డ్రగ్స్ సరఫరా, కెల్విన్, జీషాన్తో పరిచయం, విదేశాల టూర్లు, టూర్లలో కార్యక్రమాలు, ఇతర అంశాలపై రవితేజను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, విచారణ సందర్భంగా రవితేజ మధ్యాహ్న భోజనం చేయలేదు. సిట్ అధికారులు భోజనం ఆఫర్ చేసినా రవితేజ తీసుకోలేదు. దీంతో రవితేజకు సిట్ అధికారులు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. వాటిని ఆయన తీసుకున్నారు.
సిట్ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఆచితూచి సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా, పబ్లలో డ్రగ్స్ ఉంటాయా? మీరు డ్రగ్స్ తీసుకుంటారా? డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి వారికి అందజేసేవారు? మరోవైపు జిషాన్తో పరిచయం ఎలా అయింది? కెల్విన్ను జీశాన్ పరిచయం చేశాడా? జీశాన్ ను కెల్విన్ పరిచయం చేశాడా? అతనితో సంబంధాలు ఏంటి? వంటి ప్రశ్నలకు రవితేజ నుంచి సమాధానం రాబడుతున్నారు.