పూజలు చేస్తోంటే బయటకు పిలిచి గ్యాంగ్ రేప్, నిందితుల్లో మైనర్
తనకు మంచి జరగాలని ఆలయంలో పూజలు చేస్తున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కిరాతకులు. ఈ ఘటన దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంత్ పూర్ లో చోటుచేసుకొంది.
దండేపల్లి:తనకు మంచి జరగాలని ఆలయంలో పూజలు చేస్తున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కిరాతకులు. ఈ ఘటన దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంత్ పూర్ లో చోటుచేసుకొంది.
దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంత్ పూర్ గ్రామానికి చెందిన దళిత బాలికను ఫిబ్రవరి 12వ, తేదిన ఆలయంలో పూజలు చేస్తుండగా ఆరుగురు నిందితులు ఆ బాలికను తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగుు నిందితులను సోమవారం నాడు అరెస్టు చేసినట్టుగా మంచిర్యాల ఎసిపి సిహెచ్ చెన్నయ్య చెప్పారు.
సౌడం లక్ష్మణ్ , జెల్లపెల్లి అంజన్ కుమార్, అల్లం రవి, జెలపెల్లి వెంకటేష్, వేముల మధుకర్ తో పాటు మరో మైనర్ బాలుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
నిందితులకు మరో నలుగురు సహకరించారని ఎసిపి చెన్నయ్య చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన, సహకరించిన వారిపై ఎస్ సి ఎస్ టి అట్రాసిటీ యాక్ట్ తో పాటు నిర్భయ కేసు నమోదు చేసి వారిని కోర్టులో హజరుపర్చినట్టు చెప్పారు. నిందితుల వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లతో పాటు రెండు బైక్ లను స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు.