అరెస్ట్తో సహా నిలుపుదల: స్మితా సబర్వాల్ కేసులో ఔట్లుక్కు ఊరట
హైదరాబాద్: తన ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించారంటూ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా తమ పైన సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి.
దీని పైన విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు తీర్పును వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాజ్యంలో తీర్పు వెల్లడించే వరకు పిటిషనర్ల అరెస్టుతో పాటు తదుపరి చర్యలను నిలిపుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఔట్ లుక్ పత్రిక గ్రూపు అధ్యక్షుడు ఇంద్రనీల్ రాయ్, ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ మాధవి తాత, కార్టూనిస్టు సాహిల్ అరెస్టుతో పాటు మరే ఇతర చర్యలు తీసుకోకుండా అన్ని ప్రొసీడింగ్స్పై స్టే మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
స్మితా సబర్వాల్ ప్రతిష్టను దిగజార్చేలా కథనం, కార్టూన్ ప్రచురించారంటూ ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ ఏడాది జూలై 5న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని ఔట్ లుక్ మ్యాగజైన్ సంపాదకవర్గం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ బి శివకుమార్ ఆదేశాలను రిజర్వు చేస్తూ స్టే మంజూరు చేశారు. తదుపరి తీర్పు వెలువడే వరకు మేగజైన్ ప్రతినిధులకు ఊరట