స్నేక్ గ్యాంగ్: నిందితుల రిమాండ్ పొడగింపు
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్కు చెందిన నిందితులను పోలీసులు గురువారంనాడు హైదరాబాదులోని ఎల్బీ నగర్ కోర్టులో హాజరు పరిచారు. వారికి ఈ నెల 18వ తేదీన వరకు రిమాండ్ పొడగించారు. కాబోయే భర్తను మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు స్నేక్ గ్యాంగ్కు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
విచారణ నిమిత్తం పోలీసులు వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత వారిపై ఐదు కేసులో నమోదు చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠాకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు. స్నేక్ గ్యాంగ్ ఆగడాలకు నిలయంగా మారిన పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
పాతబస్తీలో దాగిన ఈ విషనాగుల కోసం సైబరాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కోసం పాతబస్తీ ప్రాంతాలైన పహాడిషరిఫ్, షాహిన్నగర్, ఎర్రకుంట బస్తీలలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు.
సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదాచేశారు. సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదాచేశారు.