హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూర్యాపేటలో విషాదం: పెళ్లైన ఆరోరోజే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కార్తీక స్నానం కోసం కృష్ణానదిలోకి దిగిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, సూర్యాపేటకు చెందిన కనపర్తి మహేశ్(50), మేనల్లుడు మేగరాజు ప్రశాంత్ (27)తో కలిసి అత్తగారి గ్రామమైన నల్గొండ జిల్లా మునగాలకు బుధవారం వెళ్లారు.

కార్తీకపౌర్ణమి సందర్భంగా మునగాలలో నాగార్జునసాగర్ హెడ్‌రెగ్యులేటర్ వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు నీటిలోకి దిగారు. స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో ఇది గమనించిన స్థానికులు నీటిలో కొట్టుకుపోతున్న ప్రశాంత్‌ను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.

 software engineer dead in krishna river at suryapet

మహేశ్ ఆచూకీ మాత్రం లభించలేదు. అప్పటికే అపస్మారక స్థితికి చేరిన ప్రశాంత్‌ను అంబులెన్స్‌లో కోదాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రశాంత్‌కు ఈ నెల 19న వివాహమైంది. మహేశ్ గల్లంతవడం, ప్రశాంత్ మృతి చెందడంతో బంధువుల ఇంట్లో రోదనలు మిన్నంటాయి.

కాగా ప్రశాంత్ ఆస్టేలియాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన ఆరు రోజులకే ప్రశాంత్ మృత్యువాతపడడంతో వధువు కుటుంబసభ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
software engineer dead in krishna river at suryapet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X