వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం: గండ్రXకేసీఆర్, కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త... రాజాసింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై కొప్పుల ఈశ్వర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసనసభా ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్కను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ లీడర్‌గా నియామకమైన భట్టిని హౌజ్‌లో కేసీఆర్ అభినందించారు.

<strong>ఆంధ్రా మిత్రులకు విజ్ఞప్తి, మొన్న కలిశా.. జగన్‌ది అచన: కేటీఆర్, ఇది బాబు కొత్త నాటకందే ఆలో!</strong>ఆంధ్రా మిత్రులకు విజ్ఞప్తి, మొన్న కలిశా.. జగన్‌ది అచన: కేటీఆర్, ఇది బాబు కొత్త నాటకందే ఆలో!

కేబినెట్ ఏర్పడలేదు.. గండ్ర

కేబినెట్ ఏర్పడలేదు.. గండ్ర

ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు అయినా కేబినెట్ ఏర్పడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ప్రభుత్వ రద్దుతో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. మళ్లీ ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పారు. గవర్నర్ స్పీచ్ కేసీఆర్ ఎన్నికల స్పీచ్‌లా ఉందని చెప్పారు. మీ గవర్నర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సంభోదించారు. దానిని కేసీఆర్ తప్పుబట్టారు. మీ కాదు.. మా గవర్నర్ (మన) అనాలని కేసీఆర్ సూచించారు. దానికి గండ్ర మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని రాశారని గుర్తు చేశారు. అందుకే అలా మాట్లాడినట్లు తెలిపారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ... అందులో తప్పేముందని, ఇప్పుడున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. టీఆర్ఎస్ అనే పదం కాంగ్రెస్ పార్టీకి సహించటం లేదా అన్నారు. ఆత్మవంచన ఎందుకు అన్నారు. కేంద్రంపై రిజర్వేషన్ల విషయంలో పోరాడేది కూడా టీఆర్ఎస్సే అన్నారు. ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలు ప్రారంభించారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

బిన్ లాడెన్‌లా గడ్డం పెంచాల్సిందే

బిన్ లాడెన్‌లా గడ్డం పెంచాల్సిందే

ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం మరో పదేళ్ల పాటు అలాగే ఉంటుందని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా అన్నారు. ఒసామా బిన్ లాడెన్‌లాగా గెడ్డం పెరగాల్సిందేనని చెప్పారు. తెలంగాణ పాలిట చంద్రబాబు గబ్బర్ సింగ్ అన్నారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చంద్రబాబును నమ్మలేదని చెప్పారు. ఇప్పుడు ఏపీ నుంచి చంద్రబాబును కూడా గెటౌట్ చేస్తారని చెప్పారు.

కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త

కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త

గవర్నర్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు. ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ల కాళ్లు పట్టుకునే పార్టీలు ఉన్నాయని చెప్పారు. అలా కాళ్లు పట్టుకున్న వారు వీళ్ల కాళ్లు కూడా గుంజుతారని, జాగ్రత్తగా ఉండాలని మజ్లిస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ కాళ్లు కూడా గుంజుతుందని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా హెరిటేజ్ బిల్డింగును కూల్చి కొత్తది కట్టాలని చెప్పారు. హెల్త్ పథకంలో కేంద్రం నిధుల వాటా చెప్పాలన్నారు. నాలుగు నెలలుగా పింఛన్లు రావడం లేదన్నారు.

English summary
Debate on Governor Narasimhan's speech in Telangana Assembly on sunday. Gandra Venkata Ramana Reddy from Congress, Raja Singh Lodh from BJP spoke in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X