హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కాచెల్లెళ్ల హత్య: 'అమిత్, శ్రీలేఖ చాలా క్లోజ్‌గా ఉండేవారు!'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్తపేట మోహన్ నగర్లో అక్కాచెల్లెళ్లు యామిని, అలేఖ్యలను దారుణంగా పొడిచి చంపిన అమిత్ సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. షాద్ నగర్‌కు చెందిన అమిత్ సింగ్ స్నేహితులు కూడా దీనిపై స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

షాద్ నగర్లో ఉన్నప్పుడు శ్రీలేఖ, అమిత్ సింగ్‌లు చాలా క్లోజ్‌గా ఉండేవారని, అతను నిత్యం శ్రీలేఖ ఇంటికి వెళ్లేవాడని చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి 2012లో ఓసారి వెళ్లిపోయారని చెప్పారని సమాచారం. పోలీసులు వారిని ట్రేస్ చేసి పట్టుకున్నారని చెప్పారు.

Srilekha had stopped talking to Amit two months back and answering his calls

దీనిపై అమిత్ తండ్రి మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడని చెప్పారు. అప్పుడు వారు తల్లిదండ్రులకు చెప్పకుండానే వెళ్లారని చెప్పారు. ఆ తర్వాత కూడా వారిద్దరు పలుమార్లు కలుసుకున్నారని తెలుస్తోంది.

రెండు నెలల క్రితం శ్రీలేఖ.. అమిత్ సింగ్‌తో మాట్లాడటం ఆపేసిందని సమాచారం. కాగా, అమిత్ సింగ్ కుటుంబం 30 ఏళ్ల క్రితం షాద్ నగర్ వచ్చి సెటిల్ అయింది. శ్రీలేఖ, అమిత్ ఇంటర్మీడియేట్ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది.

English summary
“He started stalking her as she continued to avoid him. This went on for two months before he reached her house with a knife,” said a police official from LB Nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X