రామ్ చరణ్, సానియా మీర్జా, కేటీఆర్, రాశికన్నా... వీరంతా ఓ చోట కలిస్తే.. ఓ సెల్ఫీ
భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్డులో ఫ్రీడమ్ 10కే, 5 కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్, ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్డులో ఫ్రీడమ్ 10కే, 5 కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, టెన్నిస్ తార సానియా మీర్జా, హీరోయిన్ రాశీకన్నా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, సానియా, రామ్ చరణ్, రాశికన్నా, బొంతు రామ్మోహన్ తదితరులు సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని కేటీఆర్, సానియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
#Butfirstletmetakeaselfie 😌 @KTRTRS #10KRun #Hyderabad pic.twitter.com/rKXAoigCUG
— Sania Mirza (@MirzaSania) 27 November 2016
ఈ 10 కె రన్ స్టార్లతో కళకళలాడింది. కేటీఆర్, సినీతారలు రామ్చరణ్, రాశిఖన్నా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిని చూసేందుకు ప్రజలూ ఆసక్తి చూపారు.
Flagged off the 10 K run with @KTRTRS and Ram Charan in Hyderabad this morning 🙋🏽 amazing turn out .. #runHyd #HealthyHyderabad pic.twitter.com/IctHx4HJ04
— Sania Mirza (@MirzaSania) 27 November 2016
కేటీఆర్, రామ్ చరణ్ తేజ, సానియా మీర్జా, రాశి ఖన్నా కలిసి సెల్ఫీ తీసుకున్నారు. తారలతో కళకళలాడుతున్న ఈ సెల్ఫీ ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది.
#RamCharan @MirzaSania @KTRTRS n @RaashiKhanna for #10krun #Hyderabad this morning!#runHyd #HealthyHyderabad pic.twitter.com/6SOEdGPRSj
— Telugu Filmnagar (@telugufilmnagar) 27 November 2016
ఏదైనా కార్యక్రమానికి ఓ సెలబ్రిటీ వస్తేనే హడావుడి ఉంటుంది. అలాంటిది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఒక్కచోటే కలిస్తే ఆ సందడి మరింత ఎక్కువవుతుంది. 10కె రన్లోను అదే కనిపించింది. కాగా, ఈ రన్లో పాల్గొనేందుకు వేలాది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. శనివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ రన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఎక్స్ పోలో పలువురు తమ పేర్లు నమోదు చేసుకొని, టీ షర్టులతో పాటు నియమ నిబంధ పత్రాలను పొందారు.