మొబైల్ లాక్కొని ఇంటర్ విద్యార్ధినిపై పోకిరీల వేధింపులు: ప్రశ్నించినందుకు అన్నను చితకబాదారు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్ధినిపై పోకిరి విద్యార్ధులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. విద్యార్ధిని సెల్ఫోన్ లాక్కొన్ని తోటి విద్యార్ధులకు అసభ్యకర మేసేజ్లు పంపించి వేధించారు.
విషయం తెలుసుకున్న విద్యార్ధిని సోదరుడు ఇమ్రాన్ పోకిరీలను ప్రశ్నించగా ఆరుగురు బౌన్సర్లతో ఇమ్రాన్ను చితకబాదారు. ఈ ఘటనలో విద్యార్ధని సోదరుడు ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ సంఘటన ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని అదే కాలేజీకి చెందిన అమీద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం విద్యార్ధినికి లవ్ లెటర్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది.
లవ్ లెటర్ విషయాన్ని విద్యార్ధిని తల్లిదండ్రులకు చెప్పడంతో విద్యార్ధిని సోదరుడు అమీద్ను నిలదీశాడు. దీంతో ఆరుగురు బౌన్సర్లతో విద్యార్ధిని సోదరుడు ఇమ్రాన్ను చితకబాదారు. వెంటనే సమాచారం అందుకున్న విద్యార్ధిని తండ్రి సలీం ఫలక్ నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే ఇక్కడ ఇద్దరు మైనర్లు కావడంతో ముందు కేసు నమోదు చేసుకోవడానికి పోలీసులు తటపటాయించారు. కానీ పోలీసులు ముందే ఇరు కుటుంబాలు దాడి చేసుకోవడంతో, రెండు కుటుంబాలపై కేసులు నమోదయ్యయి.
పరారీలో ఉన్న నిందితుల కోసం రెండు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో చైన్ స్నాచింగ్
తాగిన మత్తులో చైన్ పొగొట్టుకున్న ఓ వ్యక్తి చైన్ స్నాచింగ్ జరిగిందంటూ 100కు ఫోన్ చేసి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో బి. సంతోష్ రెడ్డి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
బుధవారం రాత్రి యజమానురాలిని ఎయిర్ పోర్టులో వదిలి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇస్తానంటూ స్నేహితులు రఫీక్, మునీష్లను పిలిచాడు. అర్ధరాత్రి ఓ వైన్షాపు వద్ద పుల్లుగా మద్యం సేవించి పాయా తిందామంటూ కారులో పాతబస్తీకి వెళ్లారు.
తాగిన మైకంలో ముగ్గురూ గొడవపడ్డారు. ఈ గొడవలో సంతోష్ రెడ్డికి చెందిన రెండు తులాల బంగారు గోలుసు పడిపోయింది. తెల్లవారుజామున ఇంటికి వెళ్లిన సంతోష్ రెడ్డి మెడలో గొలుపు లేకపోవడంతో 100 నెంబర్కు ఫోన్ చేసి చైన్ స్నాచింగి జరిగిందంటూ సమాచారం ఇచ్చాడు.
బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టగా ఆ గొలుసును తన స్నేహితులే కొట్టేసి ఉంటారని వెల్లడించాడు. దీంతో పోలీసులు నిందితులు రఫీక్, మునీష్ల కోసం గాలింపు చేపట్టారు.