సుధాకర్ రెడ్డి హత్య: నోరు విప్పిన రాజేష్, ఏం చెప్పాడు..
నాగర్ కర్నూలు: ప్రియురాలు స్వాతితో కలిసి ఆమె భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన సంఘటనపై నిందితుడు రాజేష్ నోరు విప్పాడు. సుధాకర్ రెడ్డి హత్యకు ఎలా పథక రచన చేసి అమలు చేసిందీ వివరించాడు.
ట్విస్ట్లే ట్విస్ట్లు: ఐసీయూలో చీకట్లోనే, నోట్లో గుడ్డలతో, రాజేష్పై అనుమానమిలా..
ముఖం కాలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సుధాకర్ అంటే స్వాతికి ఇష్టం లేదు...
సుధాకర్ రెడ్డి అంటే స్వాతికి ఇష్టం లేదని రాజేష్ చెప్పాడు. సుధాకర్ రెడ్డితో ఆమెకు సంబంధాలు సరిగా లేవని, దాంతో తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిందని అన్నారు. సుధాకర్ రెడ్డిని చంపాలని అనుకోలేదని, అది అలా జరిగిపోయిందని అన్నాడు.
పారిపోదామని చెప్పా...
ఇద్దరం ఎక్కడికైనా పారిపోదామని స్వాతితో తాను చెప్పానని రాజేష్ అన్నాడు. అయితే, పిల్లలూ తల్లిదండ్రులనూ వదిలేసి రాలేనని చెప్పిందని, దాంతో సుధాకర్ రెడ్డిని హత్య చేసి అతని స్థానంలో తాను రావడానికి పథక రచన చేశామని అతను చెప్పాడు. సుధాకర్ రెడ్డిని చంపేద్దామనే ఆలోచన చేసింది స్వాతి అని చెప్పాడు.
ముందు రోజు వారిద్దరి మధ్య గొడవ
హత్యకు ముందు రోజు స్వాతికి, సుధాకర్ రెడ్డికి మధ్య గొడవ జరిగిందని, ఆ మర్నాడు సుధాకర్ రెడ్డిని హత్య చేసి ఇనుపరాడ్తో ఇంట్లోనే కొట్టి చంపినట్లు తెలిపాడు. ఇనుపరాడ్తో తలపై బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని తగులబెట్టి ఇంటికి వచ్చేటప్పుడు రాజేష్, స్వాతి పెట్రోల్ తెచ్చుకున్నారు.
స్వాతి చున్నీపై పెట్రోల్ పోసి
స్వాతి చున్నీపై పెట్రోల్ పోసి, కాల్చి రాజేష్ ముఖంపై వేసుకున్నాడు. అయితే, సరిగా కాలకపోవడంతో అతను ముఖాన్ని మండుతున్న స్టౌవ్పై పెట్టాడు. ఆ తర్వాత రాజేష్ను సుధాకర్ రెడ్డిగా చూపించేందుకు స్వాతి ప్రయత్నించిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి హత్యకు రెండు రోజుల ముందే ప్లాన్ వేసుకున్నట్లు రాజేష్ వెల్లడించాడు.