వ్యభిచారం నిర్వహిస్తున్నావని!: రూ.88వేలు కాజేసిన సూడో పోలీస్..
అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నావంటూ ఓ వ్యక్తిని బెదిరించిన సూడో పోలీసుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బాధితుడి నుంచి రూ.88వేలు గుంజినట్లు గుర్తించారు.మల్కాజ్ గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్
హైదరాబాద్: అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నావంటూ ఓ వ్యక్తిని బెదిరించిన సూడో పోలీసుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బాధితుడి నుంచి రూ.88వేలు గుంజినట్లు గుర్తించారు.మల్కాజ్ గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మల్కాజ్ గిరి ఏసీపీ సందీప్ కథనం ప్రకారం.. గ్రంధి శివానంద స్వామి అనే వ్యక్తిని ఇటీవల కొంతమంది వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నామంటూ బెదిరించారు. తాము పోలీసులమని చెప్పుకుంటూ బాధితుడి నుంచి రూ.1లక్ష డిమాండ్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక శివానంద రూ.88వేలు సమర్పించుకున్నాడు.
తాజాగా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సూడో పోలీస్ ముఠాను అరెస్ట్ చేశారు.నిందితుల్లో హైదరాబాద్ కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు చెప్పారు. అతనితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక తుపాకీ, రూ.63వేల నగదు, ఒక పోలీస్ యూనిఫామ్ను స్వాధీనం చేసుకున్నారు.