నేడే పుట్టిన రోజు, నేను మిస్సవుతున్నా: శ్రీనివాస్ కూచిభొట్ల భార్య
శ్రీనివాస్ కూచిభొట్ల జీవించి ఉంటే నేడు 33వ తేదీన జన్మ దిన వేడుకలు నిర్వహించుకుని ఉండేవారు. కానీ ఆయన లేరు. ఆయన భార్య విషాదంతో కూడిన విషెస్ చెప్పారు.
హైదరాబాద్: తెలుగు ఇంజనీరు శ్రీనివాస్ కూచిభొట్ల జీవించి న్నట్లయితే గురువారం ఈ రోజు 33వ జన్మదిన వేడుకలను చేసుకని ఉండేవారు. అమెరికాలోని కాన్సాస్లో ఆడమ్ ప్యురింటిన్ జరిపిన కాల్పుల్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే.
ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య సునయన ఇప్పటికి కూడా ఆ విషాదం నుంచి తెప్పరిల్లలేదు. కన్నీరు పెడుతూ ఆయన జ్ఞాపకాలను సునయన విషెష్ చెప్పారు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆమె ఫేస్బుక్లో ఓ లేఖను పోస్టు చేశారు.
"హ్యాపీ బర్త్ డే మై లవ్. ఇలా శుభాకాంక్షలు చెబుతున్నందుకు బాధగా ఉంది. నిన్ను చాలా మిస్సవుతున్నా" అంటూ ఆమె పోస్టు పెట్టారు. శ్రీనివాస్ బంధువులు ఇంకా విషాదం నుంచి కోలుకేలేదని అంటున్నారు .శ్రీనివాస్ జీవించి ఉన్నప్పుడు తన పుట్టిన రోజునాడు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడేవాడని చెబుతున్నారు.
తల్లిదండ్రులు ఆశీర్వాదం కూడా తీసుకునేవాడు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాదులోని కెబిఆర్ పార్కులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.