హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమాన టికెట్ బుక్ చేసుకున్నారని..: సైబరాబాద్, రాచకొండలోనూ పరిపూర్ణానంద బహిష్కరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కాకినాడ: ఇప్పటికే ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిన పోలీసులు.. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు మరోసారి షాకిచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పరిపూర్ణానందపై ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

పరిపూర్ణానంద స్వామిని కాకినాడ తరలింపు

ఈ నేపథ్యంలో గురువారం స్వామి పరిపూర్ణానంద మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్ వరకే పరిమితం కావడంతో సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడ్నుంచి సైబరాబాద్ పరిధిలోకి వెళ్లాలని చూసినట్లు సమాచారం.

Swami Paripoornananda Books A Ticket to Hyderabad

అయితే, ఈ విషయంపై సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు.. వెంటనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ స్వామి పరిపర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయల్దేరినట్లు తెలిసింది. కాగా, బుధవారం తెల్లవారుజామునే పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ పోలీసులు కాకినాడకు తరలించిన విషయం తెలిసిందే.

English summary
According to the reports, Paripoornananda Swamy has booked a ticket from Madhurapudi airport in Kakinada to Shamsabad airport in Hyderabad this afternoon. It is learned that Cyberabad and Rachakand police have begun moving towards Kakinada with notices to prevent his visit to Cyberabad and Rachakonda limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X