వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిర్డీలో కట్టింది ఆలయం కాదు, శ్మశానం: స్వరూపానంద

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.

శ్మశానానికి హిందువులు ఎవరూ వెళ్లరని ఆయన న్నారు. షిర్డీ సంస్థాన్ ఓ శ్మశానమని ఆయన వ్యాఖ్యానించారు. సాయి పురాణం, సాయి రామాయణం ఎందుకు రాస్తారని, సాయి బైబిల్, సాయి ఖురాన్ ఎందుకు రాయరని ఆయన అడిగారు.

సాయి పురాణాల్లో సాయిబాబా ముస్లిం అని స్పష్టంగా రాసి ఉందని చెప్పారు. సాయి చమత్కారి అయితే దేశానికి స్వాతంత్ర్యం ఎందుకు తేలేదని అడిగారు. గోవధను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అపూజ్యులను పూజించడం వల్లనే దేశంలో కరువులు, కష్టాలు వస్తున్నాయని అన్నారు.

Swarupananda

షిర్డీ సాయిబాబా దేవుడు కాడని ఆయన గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. చాంద్ మియాను దేవుడిగా ఎలా పూజిస్తారని ఆయన అడుగుతూ వస్తున్నారు. స్వరూపానంద తీరుపై సాయి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.

షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.

English summary
Dwaraka Peetham Swarupananda is continuing his verbal attack on Shirdi Saibaba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X