సింగరేణి కార్మికులకు తీపి కబురు ... దీపావళి బోనస్ భారీగా ప్రకటించిన యాజమాన్యం
Recommended Video
సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా ప్రతి ఏడాది బోనస్ ఇస్తున్న సింగరేణి యాజమాన్యం ఈ ఏడాది దీపావళికి ముందే కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు గతంలో ఇచ్చిన బోనస్ కంటే ఎక్కువగా భారీ బోనస్ ను కార్మికులకు అందించనుంది.
సింగరేణి బోనస్ ఎలా చెల్లిస్తారు..? అప్పుచేస్తారా..? అని కేసీఆర్కు లక్ష్మణ్ ప్రశ్న
సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సింగరేణి యాజమాన్యం ఈసారి ఇవ్వబోతున్న బోనస్ ఎంత అంటే.. గతేడాది సింగరేణి యాజమాన్యం కార్మికులకు 60, 500 రూపాయల చొప్పున బోనస్ గా చెల్లించింది. ఇక ఈ సారి మరింత ఎక్కువగా బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈసారి ఒక్కో కార్మికుడికి 64,700 రూపాయలను బోనస్ గా చెల్లించనున్నట్లు తెలిపింది. ఇక ఈ బోనస్ ను 25 వ తేదీన కార్మికులకు అందించనుంది.
సింగరేణి లో పనిచేస్తున్న దాదాపు 48 వేల మందికి పైగా కార్మికులు యాజమాన్యం అందిస్తున్న ప్రతిభ ఆధారిత ప్రయోజనంగా పి ఎల్ ఆర్ బోనస్ ను అందుకోనున్నారు. దీంతో సింగరేణి కార్మికులు తమ కుటుంబాలతో పండుగ జరుపుకునేలా యాజమాన్యం బోనస్ ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. యాజమాన్యం దీపావళి పండుగ సందర్భంగా తమ జీవితాల్లో నిజంగానే వెలుగులు నింపింది అని, కుటుంబ సభ్యులతో కలిసి పండగను సంతోషంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.