ఆ విషయంలో జగన్ ను తెగ పొగిడేస్తున్న కాంగ్రెస్ నేతలు .. ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెగ పొగిడేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కితాబు ఇస్తున్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం చాలా బాగుందని అది తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులలో అనవసరపు వ్యయాన్ని తగ్గించడానికి ప్రవేశ పెట్టినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని, తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రవేశ పెట్టాలని తెలంగాణలోని కాంగ్రెస్ నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రివర్స్ టెండరింగ్ విధానం రాష్ట్రంలో ఎన్నో సత్ఫాలితాలను ఇస్తుందని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రజాధనం వెనక్కి తీసుకొచ్చినందుకు జగన్ కి అభినందనలు తెలిపారు .
అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రాజెక్టుల పేర్లతో ప్రజాధనాన్ని చాలావరకు తెలంగాణ సర్కార్ దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సైతం రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో కూడా ప్రాజెక్టుల విషయంలో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఈ రివర్స్ టెండరింగ్ పర్యవేక్షణను జరపాలని కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అవినీతి ఓ కమిటీని ఏర్పాటు చేస్తే తప్పక బయటపడుతుందని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే తెలంగాణ లో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణాలో ప్రజాధనాన్ని తెలంగాణ గవర్నమెంట్ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీ లను జగన్ సర్కార్ ను తెగ మెచ్చుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేయాలని కోరుతున్నారు.