దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనవద్దని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు చెప్పారు.
హైదరాబాద్: దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనవద్దని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు చెప్పారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న దాసరికి కిమ్స్లో ఆపరేషన్ జరుగుతోంది.
దాసరి
నారాయణరావు
ఆరోగ్యంగానే
ఉన్నారు,చికిత్స
జరుగుతోంది:
వైద్యులు
దాసరిని మంత్రి తలసాని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్యులు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారన్నారు. దాసరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందొద్దన్నారు. సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని చెప్పారు.
కాగా, దాసరి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని కిమ్స్ వైద్యులు తెలిపారు. అన్నవాహికలో సమస్యను గుర్తించి చికిత్స అందిస్తుండగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు.
శస్త్రచికిత్స పూర్తయిందని, డయాలసిస్, వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, రెండు మూడు రోజుల్లో కోలుకుంటారన్నారు.
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని మంగళవారం పలువురు పరామర్శించారు. నటుడు మోహన్ బాబు, నటి జయసుధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రిలో పరామర్శించారు.