షాక్: యోగా శిక్షణ పేరుతో టెక్కీల కిడ్నాప్
యోగ శిక్షణ పేరుతో ఓ టెక్కీ జంటను డగ్ర్స్కు బానిసనగా మార్చారు.తమిళనాడులో ఉన్న ఈ జంటను పోలీసులు గుర్తించారు.టెక్కీ దంపతులను యోగా శిక్షకురాలు కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: హైద్రాబాద్కు చెందిన దంపతులు తమిళనాడులోని తిరువణ్ణామలైలో దొరికారు. యోగా శిక్షణ కోసం హైద్రాబాద్కు చెందిన కిరణ్, జగదీష్ దంపతులు గత నెలలో నగరంలోని యోగా శిక్షణ కేంద్రానికి వెళ్ళారు.వీరిద్దరూ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.
కిరణ్ మాదకద్రవ్యాలకు బానిస కావడంతో చికిత్సకోసం యోగా కేంద్రం చేర్చారు. చికిత్సలో భాగంగా గత నెల 2న, కిరణ్, జగదీష్ ను దీసుకొని యోగా శిక్షకులు ఉషా శ్రీధర్, శ్రీకాంత్రెడ్డగి తమిళనాడులోని ఆలయాల సందర్శనకు తీసుకెళ్ళారు.
శిక్షణ సమయంలోనే దంపతలు నుండి 20 సవర్ల బంగారం, రూ2 లక్షల నగదును తీసుకొన్నారు. యోగా కేంద్రానికి వెళ్ళిన కెనడీ దంపతులు తిరిగి రాకపోవడంతో కిరణ్ కెనడీ సోదరి భర్త బాలసుబ్రమణ్యం మాదాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
దరిమిలా కిరణ్, జగదీష్, శ్రీధర్, శ్రీకాంత్రెడ్డి శుక్రవారం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. వీరి వ్యవవహరం అనుమానాస్పదంగా ఉండడంతో తిరువణ్ణామలై తూర్పు పోలీసులు నలుగురిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్ళారు. విచాచణలో జగదీష్ దంపతులు కిడ్నాప్కు గురయ్యారని మాదాపూర్ పోలీసులకు సమాచారమిచ్చారు.
డ్రగ్స్కు బానిసలుగా యోగా శిక్షణ పేరుతో మత్తుమందులకు బానిసలుగా చేసి దోచుకొంటున్నారని హైద్రాబాద్ పోలీసులు ప్రకటించారు.హైద్రాబాద్కు చెందిన జగదీష్ కెనడీ, ఆయన భార్య కిరణ్మయి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. యోగశిక్షణ ప్రకటనను చూసిన కిరణ్మయి, జగదీష్లో ఆ సెంటర్లో చేరారు. అయితే ఉషశ్రీ వారికి యోగశిక్షణ పేరుతో మత్తుమందులకు గురిచేసి దోచుకొంటున్నారని పోలీసులు చెప్పారు.