బాబుకు ఘన స్వాగతం: టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడిగా మాగంటి(ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి హైదరాబాద్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు తీన్మార్, బాణసంచాతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అంతకముందు ఆదివారం ఉదయం టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా జూబ్లిహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.
బాబుకు ఘన స్వాగతం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి హైదరాబాద్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
బాబుకు ఘన స్వాగతం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి హైదరాబాద్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
బాబుకు ఘన స్వాగతం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి హైదరాబాద్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
బాబుకు ఘన స్వాగతం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి హైదరాబాద్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
బాబుకు ఘన స్వాగతం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి హైదరాబాద్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
బాబుకు ఘన స్వాగతం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి హైదరాబాద్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్
ఈ సందర్భంగా జరిగిన సభలో భారీగా హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో సిద్ధాంతపరంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని, ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఆపదలో ఉన్నా ఆదుకుంటామన్నారు.
టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్
హైదరాబాద్ను చంద్రబాబు అభివృద్ధి చేయడం వల్లే తెలంగాణ ఖజానాకు నగరం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. 16 నెలల పాలనా కాలంలో బలవంతంగా పన్ను వసూలు చేయడం తప్ప నగరాభివృద్ధికి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్
హైదరాబాద్లో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు వచ్చాయన్నారు. విలీనం చేసి ఎనిమిదేళ్లైనా శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించలేక పోయారన్నారు. 'లీడర్లను చేసిన పార్టీని వీడి విశ్వాసం లేని నాయుకులు మాత్రమే బయటకు పోయారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు మాతో ఉన్నారు.' అని అన్నారు.
టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్
వారి అండతో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీకి చెల్లించే ఆస్తిపన్నును ఆర్టీసికి ఇవ్వాలని నిర్ణయించడం సీఎం అవగాహనా రాహిత్యమన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఆధార్ అనుసంధానం కోసం లక్షలాది రూపాయలు, ఉద్యోగుల పనిగంటలు వృథ చేశారని మండిపడ్డారు.
టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్
టీడీపీ, బీజేపీని బలహీనపర్చేలా వార్డుల పునర్విభజన చేశారని ఆరోపించారు. 125 చదరపు గజాలలోపు స్థలం, నిర్మాణాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని జారీ చేసిన జీవో-58 అమలుకు ఉద్యమిస్తామన్నారు.
టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇతర పార్టీల ఎమ్మేల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. 'టీడీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు. రేపు ఏం జరుగుతుందన్న భయం వద్దు.. మీకు అండగా పార్టీ ఉంది. మేమున్నాం' అంటూ భరోసా ఇచ్చారు.
టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేయర పీఠం టీడీపీ, బీజేపీలు కైవసం చేసుకుంటాయని, గ్రేటర్లో జెండా ఎగురవేస్తే 2019 ఎన్నికల్లో రాష్ట్రాధికారం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 'రహదారులపై గుంతులు చూపిస్తే రూ.1000 ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. గంతులు లేని రోడ్లు చూపిస్తే టీడీపీ తరుపున అదే వెయ్యి మేమిస్తామని' మాగంటి పేర్కొన్నారు.