ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైద్రాబాద్లో అరెస్ట్, 'కుట్రచేశారు'
నకిలీ పత్రాలతో భూముల కబ్జాలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైద్రాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.
హైదరాబాద్:నకిలీ పత్రాలతో భూముల కబ్జాలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైద్రాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో తనను కుట్రచేసి ఇరికించారని ఆయన ఆరోపించారు.
దీపక్ రెడ్డిపై హైద్రాబాద్ నగరంలో పలు భూ కబ్జా కేసులున్నాయి. వందల ఎకరాలను ఆయన అనుచరులు కబ్జాలో ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు దీపక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై భూ కబ్జాలకు సంబంధించిన ఆరు కేసులున్నాయి.
దీపక్ రెడ్డి భూ కబ్జాలపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీపక్ రెడ్డి మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి అల్లుడు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
కుట్ర చేశారు
పథకం ప్రకారంగానే తనను ఈ కేసులో ఇరికించారని ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు.తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగుచూస్తాయన్నారాయన.
మరోవైపు తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.అంతేకాదు దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు దీపక్ రెడ్డి.