ఉద్యోగం కోసం వెళ్లి నైజీరియా బందీలుగా..: ఒకరు పాలమూరు టెక్కీ
ఢిల్లీ: ఉద్యోగం కోసం ఆఫ్రికా వెళ్లి నైజీరియా నౌకాదళ చెరలో న్న తమ కుమారులను కాపాడాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు బాధిత కుటుంబ సభ్యులు బుధవారం విజ్ఢప్తి చేశారు.
తెలంగాణ, హర్యానా, చండీగఢ్, యూపీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పదకొండు మంది ఇంజినీర్లను నైజీరియా నౌకాదళం అదుపులోకి తీసుకుంది. కంపెనీ పనిమీద ఓడలో కామెరూన్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
తమ కుమారులను విడిపించాలని, ఆక్కడి కోర్టు తీర్పు ఆలస్యంగా రావడంతో విడుదలలో జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, బందీలలో తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇంజనీర్ కూడా ఒకరు ఉన్నారు. జిల్లాలోని కొత్తకోటకు చెందిన దశరథ్ తనయుడు మనోజ్ కుమార్ బందీలలో ఉన్నారు. వీరు హైదరాబాదులో ఉంటున్నారు.
మనోజ్ ముంబై కన్సల్టెన్సీ ద్వారా 2013లో ఘనా వెళ్లారు. కంపెనీ పాత ఓడను విక్రయించేందుకు 2014 ఏప్రిల్లో కామెరూన్ వెళ్తుండగా ఓడ సముద్రం మధ్యలో పాడైంది. దాని మరమ్మతుకు యత్నిస్తుండగా నైజిరియా పోలీసులు.. ఓడను పరిశీలించి అందులో ఇంధనం తదితరాలు అక్రమంగా వెళ్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది.