డ్రైనేజీ లీక్పై వెంటనే: టెక్కీ ట్వీట్కు కేటీఆర్ క్విక్ రెస్పాన్స్
హైదరాబాద్: ఓ టెక్కీ ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కెటి రామారావు దృష్టికి ఓ సమస్యను తీసుకుని వెళ్లారు. సైబరాబాదులో డ్రైనేజీ పొంగిపొర్లుతున్న విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేసి కేటీఆర్కు పెట్టారు.
హైదరాబాదులోని మాదాపూర్లో గల హైటెక్ థియేటర్ వద్ద డ్రైనేజీ పొంగిపొర్లుతున్న విషయాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరు శివశంకర్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే మంత్రి ప్రతిస్పందించారు.
ట్వీట్కు ప్రతిస్పందిస్తూ కేటీఆర్ జిహెచ్ఎంసి కమిషనర్, సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ల అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేసి - సంఘటనా స్థలాన్ని సందర్శించి, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని సూచించారు.
హరిజన బస్తీ వద్ద డ్రెయిన్ను రీమోడలింగ్ చేయడం వల్ల రోడ్డుపై మురికి నీరు పొంగిపొర్లుతోందని జిహెచ్ఎంసి అధికారులు అంటున్నారు. దానికితోడు, సంబంధిత అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని శివశంకర్తో మాట్లాడారు.