వీణావాణీల ఇష్యూ: ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీల సొమ్మును స్వాహా చేశారని ఆరోపిస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేతలు ఇవాళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వెళ్లి ఎండీ రాధాకృష్ణ నీచాతినీచానికి ఒడిగట్టాడని ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు.
అవిభక్త జంట కవలలను విడదీయడానికి టీవీ ప్రోగ్రామ్ ద్వారా వసూలైన చందాలను స్వాహా చేశాడని వారు ఆరోపించారు. ఈ అంశంపై త్వరితగతిన విచారణ జరిపి వీణా-వాణీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రేటర్లో మాదే గెలుపు..
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు ఎప్పుడూ భయపడలేదని పార్లమెంటు సభ్యుడదు బాల్క సుమన్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బస్తీల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించాలన్నారు. సామాన్య కార్యకర్తలకు కూడా టికెట్లు ఇస్తున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీదని తెలిపారు.