వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ తో మంత్రుల సమావేశం, విభజన సమస్యలే ఎజెండా

రెండు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకుగాను ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :తెలంగాణ, ఆం ధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకుగాను రెండు రాష్ట్రాల మంత్రులు గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్ లో సమావేశమయ్యారు.

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయి.అయితే ఈ సమస్యలపై రెండు రాష్ట్రాల మంత్రులు కమిటీ ఈ నెల 1వ, తేదిన సమావేశమైంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు.

దీంతో గురువారం నాడు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు మరోసారి రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో చర్చించారు.

telangana and andhra pradesh ministers meeting with governor

రెండు రాష్ట్రాల మద్య ఉద్యోగుల విభజన అంశం ఇంకా పూర్తి కాలేదు. అదే విధంగా తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల విభజన అంశం కూడ అలానే ఉంది. దీనికితోడు భవనాల అప్పగింత అంశం కూడ పెండింగ్ లో ఉంది.వీటికి తోడు ఇంకా అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.

సమస్యలపై కోర్టులను ఆశ్రయించకుండా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సమావేశమై పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించాడు. ఈ మేరకు మంత్రుల కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు గురువారం మధ్చాహ్పం ఎపి ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు , తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు రాజ్ భవన్ లో సమావేశమయ్యారు.

ఈ బేటీలో రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న అంశాలపై చర్చించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు సానుకూల వాతావరణంలోనే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

English summary
telangana and andhra pradesh ministers meeting with governor at rajbhavan on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X