కేసీఆర్ సర్కార్ వరం: 57 ఏళ్లకే ఇకపై పెన్షన్లు.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు
తెలంగాణ ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.1,82,914.42 కోట్లతో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజాసంక్షేమం రైతు సంక్షేమంకు పెద్ద పీట వేస్తోందని వెల్లడించారు. అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్తో న్యాయం జరుగుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతులకు పూర్తిగా రుణమాఫీలు చేస్తామని చెప్పిన మంత్రి హరీష్ రావు... వృద్ధాప్య పెన్షన్ల వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. వారికిచ్చే పెన్షను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వస్తుందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని వెల్లడించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షితమైన త్రాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. అదేసమయంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేయడం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. ఇక హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ముగియగానే... సమావేశాలను బుధవారంకు వాయిదా వేశారు స్పీకర్ పోచారం.
Recommended Video
ఇక ఈ రోజు మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల హైలైట్స్ ఇలా ఉన్నాయి.