జూన్ 18న తెలంగాణ క్యాబినెట్ సమావేశం.
తెలంగాణ ఎర్పడ్డ నాలుగు నెలల తర్వాత మరోసారి జూన్ 18న రాష్ట్ర్ర మంత్రి వర్గం జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో రాష్ట్ర్ర కేబినెట్ భేటి జరిగింది. అనంతరం వరుసగా ఎన్నికలు రావడంతో మంత్రి వర్గం సమావేశం కాలేదు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలోనే జూన్ 18న కేబినెట్ సమావేశం కానుంది.
ఇక క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆ అంశంపై చర్చించనున్నారు.మరోవైపు పెంచిన పెన్షన్లతో పాటు, రాష్ట్ర్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు , అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. మరోవైపు రాష్ట్ర్రంలో నూతన పురపాలక చట్టం పై చర్చించడంతోపాటు రెవెన్యు శాఖలోని సంస్కరణలపై కూడ సమావేశంలో చర్చించి వాటికి తుది రూపం ఇవ్వనున్నారు.
ఇక రైతులకు ప్రకటించిన లక్ష రుపాయల రుణమాఫీపై కి సంబంధించిన విధివిధాలను ఖారారు చేయనున్నారు.ఈనేపథ్యంలోనే కొత్త సచివాలయ నిర్మాణం లాంటీ అంశాలపై కూడ చర్చించనున్నారు.