ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలపై అధిష్టానంతో చర్చిస్తా: కుంతియా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించనున్నట్టు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ప్రకటించారు.
Recommended Video
తెలంగాణ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మరో వైపు నల్గొండ, ఆలంపూర్ ఎమ్మెల్యలే శాసనసభసభ్యత్వాలను రద్దు చేశారు.
ఈ విషయమై మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని చేరవేశారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు.అయితే ఈ విషయమై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చెప్పారు.