తెలంగాణ టీఆర్ఎస్దే: హరీష్,కేటీఆర్లకు రికార్డ్ మెజార్టీ, రేవంత్ రెడ్డి, సుహాసిని సహా నేతల ఓటమి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు నేడు (మంగళవారం - 11-12-2018) వెలువడినాయి. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. టీఆర్ఎస్ 88, మహాకూటమి 21, మజ్లిస్ 7, బీజేపీ 1, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.
కీలక స్థానాలు
గజ్వెల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ 58వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసినిపై మాధవరం కృష్ణారావు 43వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
కొడంగల్ - రేవంత్ రెడ్డి పైన పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు.
సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి పైన కేటీఆర్ 58వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.
సిద్దిపేట - హరీష్ రావు లక్షకు పైగా మెజార్టీతో గెలిచారు.
TRS President and Telangana caretaker Chief Minister K Chandrashekhar Rao wins from Gajwel constituency by over 50,000 votes. #TelanganaElections2018 (file pic) pic.twitter.com/UXP5UYOrnd
— ANI (@ANI) December 11, 2018