అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్లంగా ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు స్పీకర్ మధుసూదనాచారి నివాళులర్పించారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని స్పీకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనమండిలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో రాష్ట్రహోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను ఎగురవేశారు.
అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని నాయిని అన్నారు. ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి తుమ్మల జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.