399 మంది ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష! ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను పంద్రాగస్టు రోజున రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం 399 మందికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతరం చేసినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 15వ తేదీన వీరిని.. వివిధ జైళ్ల నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.
ఖైదీల విడుదలకు సంబంధించి విధివిధానాలను పది రోజుల్లో పూర్తి చేయాలని హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్ల నుంచి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తోంది. 2016 నుంచి ఖైదీలను విడుదల చేస్తూ వస్తుంది. జీవిత, తక్కువ శిక్షాకాలం ఖైదీలను ఎంపిక చేసి రిలీజ్ చేస్తుంది.
గతంలో మాదిరిగానే ఈ సారి కూడా క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. ఖైదీలు, వారి కుటుంబీకులు, రాజకీయ పార్టీ నేతుల, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం విడుదల చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.