సంక్రాంతి సందర్భంగా.. ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా సర్కార్.. ఆ డబ్బు ఖాతాల్లో
Recommended Video
తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని 55 రోజుల పాటు సమీ చేసిన సమయంలో వారికి చెల్లించాల్సిన వేతనాలను ఆపివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ ఉద్యోగులకు ఆ వేతనాలు చెల్లిస్తామని చెప్పి గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు .. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన తెలంగాణా ఎంపీ
ఆర్టీసీ కార్మికులకు చెల్లింపు చెయ్యని జీతాలను సంక్రాంతికి ఇస్తామన్న యాజమాన్యం
తెలంగాణా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ,ఏపీ తరహాలో ఆర్టీసీని విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు వదిలారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం కఠినం గా వ్యవహరించింది. సమ్మె సమయంలో జీతాలు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపించింది. ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగిరావటంతో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులకు చెల్లింపు చెయ్యని జీతాలను ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా చెల్లిస్తుంది.
సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయం
సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను కూడా చెల్లించింది యాజమాన్యం. మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో, బస్సులను నిలిపివేస్తామని అద్దె బస్సుల ఓనర్లు ఈడీకి లేఖ రాయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు రూ. 20 కోట్లు రిలీజ్ చేసింది
ఈ నెల 11న ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో సమ్మె కాలపు జీతం జమ
ఇక
అంతే
కాకుండా
ఆర్టీసీ
వెల్ఫేర్
బోర్టులో
202
మంది
సభ్యులను
నియమిస్తూ
సర్కులర్
జారీ
చేశారు.
ప్రతి
డిపో
నుంచి
ఒక
సభ్యుడు
ప్రాతినిథ్యం
వహించేలా
నియామకాలు
జరిగాయి.
రీజియన్
మేనేజర్లు
సదరు
సభ్యులను
నామినేట్
చేశారు.
వీరు
ఆ
డిపో
పరిధిలోని
ఉద్యోగుల
సమస్యల
పరిష్కారం
దిశగా
పనిచేయనున్నారు.
మొత్తానికి
ఇన్ని
రోజుల
పాటు
చెల్లింపు
చేయని
ఆర్టీసీ
కార్మికుల
జీతాలు
ఈ
నెల
11న
ఖాతాల్లో
వేయనున్నారన్న
శుభవార్త
ఆర్టీసీ
కార్మిక
కుటుంబాల్లో
పండుగ
వాతావరణం
తెచ్చింది.