ఫేస్బుక్ దారిలో.. హైదరాబాద్లో వాట్సాప్ కార్యాలయం!: సీఈవోను కలిసిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో వాట్సాప్ యూజర్స్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్ను గురువారం కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
కేటీఆర్ హైదరాబాదులో ఫేస్బుక్ పీపీడీ హెడ్ శివనాథ్తో కలిసి క్రిస్ డేనియల్ను కలిశారు. ఈ సందర్భంగా వాట్సాప్, ఫేస్బుక్ కార్యకలాపాలపై చర్చించారు. కస్టమర్స్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుకు కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి వాట్సాప్ సీఈవో సానుకూలంగా స్పందించారని ఐటీ శాఖ వర్గాలు తెలిపారు.
ఫేస్బుక్ 2010లో తన ఆసియా హబ్ను తొలిసారి హైదరాబాదులో ప్రారంభించింది. ఇదే ఫేస్బుక్ 2014లో వాట్సాప్ను స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల క్రితం వాట్సాప్ సీఈవో కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ను కూడా కలిశారు. క్రిస్ డేనియల్ ఇటీవల ఐదు రోజుల భారత్ పర్యటనకు వచ్చారు.
Recommended Video
Had a fascinating dialogue with Chris Daniels, CEO of WhatsApp & his team. Shared my personal experiences of using WhatsApp extensively in my office work
— KTR (@KTRTRS) August 24, 2018
Also requested Chris to setup operations in Hyderabad pic.twitter.com/vqrdKiLYng