పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశం
హైదరాబాద్:పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశం వాడివేడిగా సాగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమాజంపై ప్రభావం అనే అంశంపై జరిగిన సమావేశంలో అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయమన్నారు. ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలే కనిపిస్తున్నారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి రెండున్నరేళ్లుగా మోదీ ఏంచేశారని ఉత్తమ్ ప్రశ్నించారు. పెదనోట్ల రద్దు సాహసోపేత నిర్ణయమేనని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దుతో బ్లాక్ మనీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు సామాజిక విశ్లేషకులు, వామపక్ష నాయకులు, ఎమ్మెల్సీలు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సభ్యులు, ప్రొపెసర్ లు ఈ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.