హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో మూడోది: ఏరోస్పేస్ ఫ్యాక్టరీని ప్రారంభించిన కేటీఆర్, ఏరోస్పేస్ యూనివర్సిటీ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లను తయారు చేసే శాఫ్రాన్ సంస్థకు చెందిన ఏరోస్పేస్ ఫ్యాక్టరీని శంషాబాద్‌లో మంత్రి కేటీఆర్ గరువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, కంపెనీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

శాఫ్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో మూడో అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీ సెంటర్ ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉందని, దీంతో హైదరాబాద్ దేశంలో ఉత్తమ ఏరోస్పేస్ వ్యాలీగా మారుతోందని కేటీఆర్ చెప్పారు.

 Telangana minister ktr inaugurating safran aerospace plant in Hyderabad

ఇతర ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ సంస్థలు కూడా హైదరాబాద్ కు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ ట్రాన్స్‌‌ఫర్మేషన్ సెంటర్ రూపంలో శాఫ్రాన్ నుంచి నాలుగో పెట్టుబడి కూడా రానుందని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులతోపాటు పరిశ్రమల వర్గాలతో కలిసి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్, డిల్లీ, ప్యారిస్ లలో 35 సమావేశాలు, 400కుపైగా మెయిల్స్, నాలుగేళ్ల నిరంతర శ్రమ కారణంగానే శాఫ్రాన్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో టీఎస్ ఐపాస్ రూపంలో అద్భుత విధానంతోపాటు మెగా ప్రాజెక్టులకు చాలా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

English summary
Telangana minister ktr inaugurating safran aerospace plant in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X