టీ హబ్లో టాటా ఇన్నోవేషన్ సెంటర్: మిస్త్రీతో మంత్రి కేటీఆర్
ముంబై: ముంబైలో టాటా సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీతో మంత్రి కేటీఆర్ సోమవారం భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్ ఆయన్ని కోరారు.
ఇందుకు సైరస్ మిస్త్రీ అంగీరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని టీ హబ్లో ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు టాటాస్పేస్ ఏఐజీ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సైరస్ మిస్త్రీ అంగీకారం తెలిపారు.
అదేవిధంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటాగ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు టాటా సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీతో కలిసి దిగిన ఫోటోను తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
In Mumbai today met with Chairman TATA Cyrus Mistry. Discussion on IT, Industry & collaboration in housing projects pic.twitter.com/Gv4nrdJ7Hl
— KTR (@KTRTRS) February 8, 2016