మెట్రో రైలు: తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల తొలి ప్రయాణం..
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది.
హైదరాబాద్: భాగ్యనగరవాసులకు శుభవార్త! ఎప్పుడెప్పుడు మెట్రో రైలులో ప్రయాణిద్దామా అని ఎదురుచూస్తున్న నగర వాసుల కోరిక తీరే సమయం ఇంకెంతో దూరం లేదు. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది.
ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మంత్రులు, హైదరాబాద్ నగరానికి చెందిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు మెట్రో ట్రయల్ రన్ జర్నీలో ప్రయాణించారు.
నాగోలు నుంచి మెట్టుగూడ వరకు జరిగిన ఈ మెట్రో రైలు ప్రయాణం అనంతరం ప్రజాప్రతినిధులు తిరిగి అదే రైలులో నాగోలుకి చేరుకున్నారు. నాగోలులో మెట్రో స్టేషన్ వద్ద ప్రజాప్రతినిధులకి మెట్రో రైలు ప్రయాణం, టికెట్ల కొనుగోలు, నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు అక్కడి ఉన్నతాధికారులు.
ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో మెట్రో రైలు స్టేషన్లలో సుందరీకరణ పనులని కూడా పరిశీలించారు మంత్రి కేటీఆర్.