హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మళ్లీ పెరుగుదల బాట పట్టిన వైరస్: వ్యాధుల సీజన్ ఎఫెక్ట్?: గ్రేటర్ సహా: ఆ రెండు చోట్ల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తెలంగాణలో మళ్లీ పెరుగుదల బాట పట్టింది. కొంతకాలంగా తగ్గుముఖం పడుతూ వచ్చిన రోజువారీ కేసులు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. వ్యాధుల సీజన్ ముసురుకోవడం వల్లే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధుల ప్రభావం కరోనా విజృంభించడానికి కారణమౌతోందని అంటున్నారు. ఫలితంగా రోజువారీ కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎన్నికల వేళ.. ట్రంప్‌కు షాకిచ్చిన ఫేస్‌బుక్: జాలి చూపిన ట్విట్టర్: అసలు విషయం ఏమిటంటే?ఎన్నికల వేళ.. ట్రంప్‌కు షాకిచ్చిన ఫేస్‌బుక్: జాలి చూపిన ట్విట్టర్: అసలు విషయం ఏమిటంటే?

రోజువారీ కేసులు పెరుగుతున్నా.. యాక్టివ్ కేసుల్లో

రోజువారీ కేసులు పెరుగుతున్నా.. యాక్టివ్ కేసుల్లో

ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. 30 వేల కంటే తక్కువగా యాక్టివ్ కేసులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. 30 వేల కంటే దిగువకు నమోదైన తరువాత.. ఇక మళ్లీ ఆ మార్క్‌ను అందుకోవట్లేదు. క్రమంగా దాని గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. రోజువారీ పాజిటివ్స్ కంటే డిశ్చార్జి అవుతోన్న వారు అధికంగా ఉండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి.

రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల్లో

రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల్లో

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనివే. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 303 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిల్లో మళ్లీ అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్-23, భద్రాద్రి కొత్తగూడెం-92, జగిత్యాల-45, జనగామ-23, జయశంకర్ భూపాలపల్లి-25, జోగుళాంబ గద్వాల-19, కామారెడ్డి-71, కరీంనగర్-96, ఖమ్మం-121, కొమరంభీమ్ ఆసిఫాబాద్-16, మహబూబ్‌నగర్-40, మహబూబాబాద్-45, మంచిర్యాల-39, మెదక్-29, మేడ్చల్ మల్కాజ్‌గిరి-187, ములుగు-25, నాగర్ కర్నూల్-33, నల్లగొండ-124, నారాయణపేట్-12, నిర్మల్-19, నిజామాబాద్-60, పెద్దపల్లి-42, రాజన్న సిరిసిల్ల-41, రంగారెడ్డి-205, సంగారెడ్డి-63, సిద్ధిపేట్-78, సూర్యాపేట్-79, వికారాబాాద్-28, వనపర్తి-31, వరంగల్ రూరల్-28, వరంగల్ అర్బన్-74, యాదాద్రి భువనగిరి-38 కేసులు నమోదు అయ్యాయి.

 జోరుగా నిర్ధారణ పరీక్షలు..

జోరుగా నిర్ధారణ పరీక్షలు..

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. యధాతథ:గా అవి కొనసాగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 54,277 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 33,46,472కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 89,910 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు. మున్ముందు కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత ముమ్మరం చేస్తామని అధికారలు స్పష్టం చేస్తున్నారు.

English summary
Newly 2,154 Covid-19 Coronavirus Positive cases and eight deaths have been reported in Telangana in past 24 hours. 2,239 Patients were discharged at the same time. Total positive cases is reached at 2,04,748 and 1,189 deaths were registered in the Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X