వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదలైన సకల నేరస్తుల సమగ్ర సర్వే, పాత నేరస్తుల ప్రవర్తనపై క్షేత్రస్థాయిలో ఆరా..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులు వినూత్న సర్వే ఒకటి చేపట్టారు. నేరస్తుల వివరాలు అడపాదడపా సేకరించడానికి భిన్నంగా.. ఏకంగా వారి లెక్కతేల్చేందుకు సర్వే మొదలుపెట్టారు.

దీనికి 'సకల నేరస్తుల సమగ్ర సర్వే'గా పేరుపెట్టారు! అంతేకాదు... ప్రతి నేరస్తుడి సమాచారాన్ని పోలీసులు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో విజయవంతమైన ఈ సర్వే గురువారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది.

పాత నేరస్తుల నడవడికపై ఆరా...

పాత నేరస్తుల నడవడికపై ఆరా...

సకల నేరస్తుల సమగ్ర సర్వేలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో గత పదేళ్లలో నేర చరిత్ర కలిగిన పాత నేరస్తుల నివాసాలకు వెళ్లి వారి ప్రవర్తన, నడవడికపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసు రికార్డుల్లో ఉన్న నేరస్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

నేరస్తుల వివరాలు బిగ్ డేటాబేస్‌లోకి...

నేరస్తుల వివరాలు బిగ్ డేటాబేస్‌లోకి...

పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ సర్వే చేపట్టారు. నేరస్తుల పూర్తి వివరాలను బిగ్ డేటాబేస్‌లో పొందుపరుస్తున్నారు. నేరగాళ్ల ఫొటోలు, వేలి ముద్రలు తీసుకోవడం తదితర విధానాలతో డేటా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ క్రైం డేటా ఎనాలసిస్ యూనిట్ ద్వారా తెలంగాణ కాప్ యాప్‌కు అనుసంధానం చేస్తారు. ఏదైనా నేరం జరిగినప్పుడు పాత కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది.

ముఖ్య నేరస్తుల ఇళ్లకు జియో ట్యాంగింగ్..

ముఖ్య నేరస్తుల ఇళ్లకు జియో ట్యాంగింగ్..

సకల నేరస్థుల సమగ్ర సర్వేలో భాగంగా ముఖ్య నేరస్తుల ఇళ్లను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు ఉపయోగిస్తున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే దొరికిపోతామనే భయాన్ని నిందితుల్లో కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

పూర్తిస్థాయిలో నేరాల అదుపు కోసమే...

పూర్తిస్థాయిలో నేరాల అదుపు కోసమే...

రాష్ట్రానికి పెట్టుబడులు అధికంగా రావడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న శాంతిభద్రతల విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సకల నేరస్తుల సమగ్ర సర్వేలో భాగంగా పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన వారికి కీలక సూచనలు చేశారు. నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉద్దేశంతో నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహిస్తోన్నట్లు చెప్పారు. ప్రతి నేరస్తుడి వివరాలు నమోదు చేయాలని డీజీపీ సూచించారు. నేరస్తుల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా సమీకృతం చేయాలని చెప్పారు.

English summary
Starting Thursday, the Telangana police department will take up a comprehensive survey of all kinds of criminals across the length and breadth of the state to prepare a database so as to help identify and track them whenever there is an offence. The exercise, called “Sakala Nerasthula Samagra Survey” (Comprehensive survey of all criminals), is aimed at not only enumerating criminals in the state, but also geo-tagging them and their addresses, Telangana director general of police (DGP) M Mahender Reddy said in a statement.All police officers in the state, right from the lowest rank up to the DGP, will visit habitations to enroll offenders with criminal history in the last 10 years. “The exercise is expected to be completed in a day or two, but it will be extended for a few more days depending on the number of offenders,” the DGP said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X