వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాదాపూర్లో కోట్ల కట్టలు : రూ.2 కోట్లు స్వాధీనం, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గుర్తింపు ?
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగదు ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డబ్బు ఏరులైపారుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు నగదు, మద్యం జోరుగా పంపిణీ చేస్తున్నారు.
మాదాపూర్లో నోట్ల కట్టలు
ఏపీలో లోక్సభతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతోన్నాయి. ఈసారి అధికారం చేపట్టేందుకు టీడీపీ, వైసీపీ, జనసేన తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పక్క రాష్ట్రాల నుంచి నగదు ప్రవాహం కొనసాగుతోంది. మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద రూ.2 కోట్ల నగదును ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును ఇద్దరు వ్యక్తులు రాజమండ్రి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఎంపీగా పోటీచేస్తున్న ఓ నాయకుడికి చెందిన డబ్బుగా గుర్తించారు. నగదును మాదాపుర్ పోలీసులకు అప్పగించినట్టు ఎస్వోటీ పోలీసులు పేర్కొన్నారు.
Comments
English summary
Money in Andhra Pradesh Vote and promotions are distributed by cash and alcohol. Rs 2 crore cash-savvy police seized at Madapur High Tech City Railway Police said two persons were taken to Rajahmundry. The money is from a leader contesting as an MP.
Story first published: Wednesday, April 3, 2019, 23:40 [IST]