'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ రచయిత, వన్ ఇండియా.కామ్ (తెలుగు పోర్టల్) సంపాదకులు కాసుల ప్రతాప రెడ్డి రచించిన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ ఆదివారం (అక్టోబర్ 4న)నాడు జరిగింది.
హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం ఈ పుస్తకావిష్కర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
మాడభూషి శ్రీధర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ తదితరులు మాట్లాడారు. కాగా, 'తెలంగాణ సాహిత్యోద్యమాలు' అనే మరో పుస్తకాన్ని కూడా కాసుల ప్రతాప రెడ్డి త్వరలో విడుదల చేయనున్నారు.
పుస్తకావిష్కరణ
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణకు హాజరైన మాడభూషి శ్రీదర్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అల్లం నారాయణ తదితరులు.
పుస్తకావిష్కరణ
ప్రముఖ తెలంగాణ రచయిత, వన్ ఇండియా.కామ్ (తెలుగు పోర్టల్) సంపాదకులు కాసుల ప్రతాప రెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన దృశ్యం.
పుస్తకావిష్కరణ
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
పుస్తకావిష్కరణ
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
పుస్తకావిష్కరణ
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కార్యరంగంలోను బౌద్ధిక రంగంలోనూ రచయిత శ్రమ ఉంది. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో.. ఎప్పటికప్పుడు బౌద్ధిక రంగంలో ఆయన కృషి చేశారు.
పుస్తకావిష్కరణ
1998 నుంచి ప్రారంభమై రాష్ట్రం ఏర్పడే వరకు బౌద్ధిక రంగంలో రచయిత కృషి కొనసాగింది. ఈ క్రమంలోనే తెలంగాణ కోసం వందలాది వ్యాసాలు రాశారు.