విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఉపాధ్యాయురాలు, వీడియో తీశారు
నర్మెట్ట: జనగామ జిల్లాలోని నర్మెట్ట మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.. విద్యార్థినితో జడ వేయించుకొని, మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
కొందరు విద్యార్థులు ఈ దృశ్యాలను వీడియో తీసి వాట్సాప్లో అప్లోడ్ చేశారు. దీంతో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సదరు ఉపాధ్యాయులురాలి నుంచి వివరణ కోరి, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు.
క్లాస్ టైంలోనే ఫిజిక్స్ టీచర్ విద్యార్థినితో జడ వేయించుకుంది. దీనిని తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడియో తీశారు. వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్ పేరు పార్వతి.
ఆమె విద్యార్థినితో తలకు నూనె రాయించుకొని, మసాజ్ చేయించుకున్నారు. ఈ వీడియోను పోస్టు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిని తొలగించి, సరైన ఫిజిక్స్ ఉపాధ్యాయురాలిని అపాయింటుమెంట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ వీడియోపై జిల్లా విద్యాధికారి స్పందించారు. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.