తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. www.tstet.cgg.gov.in , http://www.manabadi.co.in/ లో టెట్ ఫలితాలు తెలుసుకోవచ్చు.
జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 3,18,506(90.62శాతం) హాజరు, పేపర్-2కు 2,51,070(90.35శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.
టెట్(TET) నోటిఫికేషన్లో వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు రావాల్సి ఉండగా.. అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ సబిత ఇంద్రారెడ్డి ఈ టెట్ ఫలితాలను నేడు విడుదల చేశారు.
Comments
English summary
Telangana TET 2022 results released.